తెలంగాణ

వడదెబ్బకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాపేట, కడెం, మే 17: వడదెబ్బకు రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పుప్పాల యాదమ్మ (45) అనే ఉపాధి మహిళా కూలీ శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి సేద తీరే క్రమంలో అస్వస్థతకు గురై మృతి చెందినట్టు స్థానిక సర్పంచ్ పేరుమల్ల కిషన్ తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఆ కొండపేట్ గ్రామానికి చెందిన నస్పూరి భూమయ్య (54) శుక్రవారం వడదెబ్బతో మృతిచెందారు. వృత్తిరీత్యా చాకలి అయినా భూమయ్య గ్రామంలోని బట్టలను సేకరించి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు ఉతకడానికి వెళ్లాడు. బట్టలు ఉతుకుతుండగా, తల తిప్పుతోందని, భార్యతో చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని మండల తహశీల్ద్దార్ విశ్వంభర్ పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.