తెలంగాణ

నాలుగు కేటగిరీ పోస్టులకు నేడు రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ భూగర్భ జలాల శాఖలో నాలుగు కేటగిరీ పోస్టులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈ నెల 28న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది. మరో మూడు కేటగిరిలకు 29వ తేదీన ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనుంది.
అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్టు, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు, అసిస్టెంట్ హైడ్రాలజిస్టు పోస్టులకు జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీ సబ్జెక్టులపై ఈ పరీక్ష జరుగుతుంది. 29వ తేదీన టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్, టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రోజియాలజీ), టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ పోస్టులకు సిబిఆర్‌టి పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం 28న 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3990 మంది పరీక్ష రాస్తున్నారు. 29న 6 కేంద్రాలు ఏర్పాటు చేశారి. 29 నాటి పరీక్షకు 1970 మంది హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు గంట ముందే చేరుకోవాలని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ సూచించారు.