తెలంగాణ

బీజేపీ బలపడేందుకే మత విద్వేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: తెలంగాణలో బీజేపీ బలపడేందుకే మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. హిందుత్వ కార్డుతో బీజేపీ ఎదగాలని కలలు కంటుందని విమర్శించారు. తెలంగాణలో 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న వారి కల కలగానే మిగిలిపోక తప్పదన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆరే పెద్ద కరుడుగట్టిన హిందుత్వ వాది అన్నారు. మోదీ మూడు గుడులు తిరిగే రకమైతే కేసీఆర్ ఆరు గుడులు తిరిగే రకమన్నారు. అందువల్ల తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేకనే ఆ పార్టీ నాయకులు హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి అయినా ఇక్కడ బలపడాలని చూస్తుందని ఓవైసీ ఆరోపించారు.