తెలంగాణ

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమనూరు, జూలై 12: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం వద్ద మిర్యాలగూడ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి శుక్రవారం పంటపొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు ముకుందాపురం మీదుగా తుమ్మడం, నేతాపురం, మొల్కచర్ల వరకు ప్రతీ రోజు పోయి వస్తూ ఉండేది. విద్యార్ధులు, వ్యాపారులు ఈ ప్రాంతం నుండి ప్రతి రోజూ వెళ్లి వస్తుంటారు. బస్సు కొద్ది మంది ప్రయాణికులతో మొల్కచర్ల వైపు వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను తాత్కాలిక రిపేర్లు చేసి పంపిస్తుండడంతో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం... అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు