తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో.. బీజేపీకి అధికారం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, జూలై 23: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందనరావు అధ్వర్యంలో దుబ్బాకలో సభ్యత్వ నమోదు కార్యమ్రానికి అపూర్వ స్పందన లభించింది. యువత, విద్యార్ధులు, ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. గత పాలకు మూలంగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి పోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరుగుతుందని, ఇప్పటికే లక్షలాది మంది పార్టీ సభ్యత్వం తీసుకన్నారని తెలిపారు.మార్పు బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని,గెలుపు కోసం కార్యకర్త పని చేయాలి. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని జోస్యం చెప్పారు. టీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన మధవనేని భాను ప్రసాద్‌రావు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆనంతరం దుబ్బాకలో పాదయాత్ర చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ దూది శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు బాల్లేశ్, వంశీకృష్ణ,కమలాకర్ తదితరులు ఉన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్