తెలంగాణ

రెండు కౌన్సిల్ సీట్లూ టీఆర్‌ఎస్ గెలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూలై 23: నూతనంగా మున్సిపల్ పరిధిలో విలీనమైన అవుసులపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగురాలని ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అవుసులపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి ధీటుగా అవుసులపల్లి అభివృద్ధి చేస్తానన్నారు. పంచాయతీని మున్సిపాలిటీల విలీనం సందర్భంగా కొందరు వ్యతిరేకించి కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలమేరకు అనుగుణంగా నడుచుకోవడం మన బాధ్యత అన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేసినందున అందుకు అనుగుణంగా అభివృద్ది పరుచుకొని సౌకర్యాలు కల్పించేలా చూస్తానన్నారు. ఎన్నికల తర్వాత 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవుసులపల్లిలో గల 1,2 వార్డుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం.లావణ్యా శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కొట్టాల విశ్వం, యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, నాయకులు అశోక్, లింగారెడ్డి, మల్లేశం, ఆర్‌కె శ్రీనివాస్, సాదిక్‌అలీ, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.