తెలంగాణ

సేవాభారతి సేవాసంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: సమాజంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అవగాహన ప్రేరణతో పాటు వివిధ సేవా సంస్థల సమన్వయం, నిధుల సేకరణ, అనుసరించాల్సిన విధానాలు, ఉత్తమ సేవా కార్యక్రమాలపై హైదరాబాద్‌లో ప్రారంభమైన సేవా సంగమం కార్యక్రమంలో రెండో రోజు ఆదివారం నాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పాల్గోనున్నారు. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ సేవా సంగమం తొలి రోజు కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ ఏలే శ్యాంకుమార్ పాల్గొన్నారు. రామకృష్ణా మఠ్‌కు చెందిన శితికాంతనందా స్వామీజీ , సేవా భారతి అధ్యక్షుడు దుర్గారెడ్డి, సేవా సంగమం స్వాగత సమితి అధ్యక్షుడు రామరాజు, ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సేవా ప్రముఖ్ రాజ్‌కుమార్ మతలే, డాక్టర్ సుమలత, డాక్టర్ కిరణ్మయి తదితరులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరుగుతుంది. ఇందులో దుర్గారెడ్డితో పాటు రామరాజు, గసరు చంద్రప్రభుదాస్ స్వామి, రవికుమార్ ఐయ్యర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చంద్రళశేఖర్ అక్కే తదితరులు పాల్గొంటారు.