తెలంగాణ
కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాల పనులు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 October 2019
అమరచింత, అక్టోబర్ 21: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పాలమూరు తిరుపతిగా పిలుచుకుంటున్న కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం నాడు ధరించే పట్టు వస్త్రాల పనులను సోమవారం అమరచింత పద్మశాలీలు ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభం చేశారు. ఆది కాలం నుంచి ఉద్ధల ఉత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించడం పద్మశాలీలకు అనవాయితీ. అలాగే ఈసంవత్సరం కుడా కురుమూర్తి స్వామి సతీ సమేతంగా ధరించే పట్టు వస్త్రాల పనులకు శ్రీ ఫౌండేషన్ చైర్మెన్ కాడిగి గణేష్, పద్మశాలి అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న, వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభం చేశారు.