తెలంగాణ

మొక్కలు నాటిన రఘుమారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం నార్సింగి 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో సంస్థ సీఎండీ రఘుమారెడ్డి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. పర్యావరణ హితం కోరి గౌరవ సీఎం కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టారన్నారు. హరిత హరం మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. హరితహారం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కి విశేష ప్రజాదరణ వస్తోందన్నారు. ప్రతి పౌరుడిగా విధిగా ఒక మొక్క నాటాలని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలకు ఇప్పటి నుంచి ఆకుపచ్చ తెలంగాణను తీర్చదిద్దడానికి ప్రతి ఒక్కరూ చేరుూచేరుూ కలపాలని రఘుమారెడ్డి హితవు పలికారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు పాల్గొన్నారు.