తెలంగాణ
మా ఇద్దరు సభ్యులు బాగా మాట్లాడారు: సీఎల్పీ నేత భట్టి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 March 2020
హైదరాబాద్, మార్చి 7: తమ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు అనసూయ, రాజ్గోపాల్ రెడ్డి బాగా మాట్లాడారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అడ్డగోలుగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం నుంచి సమాధానం లేక విషయం లేని దయాకరరావు రెచ్చిపోయి ప్రసంగించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన రెండు సింహాలు గర్జించాయన్నారు. ప్రభుత్వం మీద పోరాటం మొదలైందన్నారు. రాజ్గోపాల్ రెడ్డికి ఎర్రబెల్లి సవాల్ విసరడం సరికాదన్నారు. పోలీసులు లేకుండా జనంలోకి వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.