తెలంగాణ

మల్లన్నసాగర్‌పై బహిరంగ చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: మల్లన్న సాగర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గోదావరి నదీ జలాల వినియోగ ఫోరం కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి సవాల్ విసిరారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అనవసరమని గవర్నర్‌ను కలిసి కోరనున్నట్లు ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. గవర్నర్ అనుమతిస్తే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గవర్నర్ పిలిపించుకుని మల్లన్నసాగర్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి, నిపుణుల సూచనలకు విరుద్ధంగా ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎందుకీ భారీ రిజర్వాయర్ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎవడబ్బ సొమ్ము అని ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్మాణం చేపడితే తన భూములు కోల్పోవాల్సి వస్తుందన్న బాధతో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.