తెలంగాణ

ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఆగస్టు 4: మెదక్ జిల్లా ఐడిఎ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుంటుంబాన్ని సజీవ దహనానికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రస్తుతం బాధితులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికుల కధనం ప్రకారం... ఐడిఎ బొల్లారం గ్రామానికి చెందిన సుంకయ్య కుటుంబం బొల్లారం నివాసం వుంటున్నారు. జగన్నాధం సుంకయ్య అనే వ్యక్తికి భార్య సునీత, కుమారులు వీరన్న (5) క్రిష్ (3) డానియల్ (1). సుంకయ్య పందుల పెంపకంతో జీవనం కొనసాగిస్తున్నాడు. యధావిధిగా వారంతా బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటాకా రెండు గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లో మొత్తం కిరోసిన్ పోసి నిప్పంటించి ఇంటి బయట నుండి గడివేశారు. మంటలు తీవ్రంగా అంటుకోవడంతో సుంకయ్య నిద్రలేచాడు అప్పటికే ఇల్లు మొత్తం మంటలో చిక్కుకొని వుంది. కుటుంబ సభ్యులంతా అరుపులు, కేకలు వేయడంతో ఇంటి పక్కనే ఉన్న ధర్మేంద్ర పాండే అనే వ్యక్తి వచ్చి వారి ఇంటి తలుపులు తీసి, సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. అప్పటికే ఇంట్లో వున్న సుంకయ్య కుటుంబ సభ్యులు 60 శాతం కాలిపోయారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ప్రశాంత్ సందర్శించి బాధితులను ఉదయం 4 గంటల సమయంలో గాంధీ అసుపత్రికి తరలించారు. ఐదుగురు కుటుంబ సభ్యుల్లో సుంకయ్య పరిస్థితి విషమంగా ఉంది. పాతకక్షలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.