తెలంగాణ

17వరకూ బిజెపి తిరంగా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ వరకూ తిరంగా యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. 17వ తేదీన తిరంగా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రప్రభుత్వం అధికారింగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ తరహా ఉద్యమాలను బిజెపి 1998 నుండి నిర్వహిస్తోంది. 18 సంవత్సరాల నుండి విమోచన దినోత్సవానికి సంబంధించి బిజెపి పలురూపాల్లో కార్యక్రమాలను చేపట్టినా ఈసారి మరింత విభిన్నంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని యోచిస్తోంది.