తెలంగాణ

గాంధీ జయంతి రోజున గోవధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయమైన అహింసా మార్గానికి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం గోవును చంపి మాంసాన్ని విక్రయించిన సంఘటన జరిగింది. గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు నిలుపుదల చేయాలని గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక అధికారులు ఆదేశించినప్పటికీ చింతబండకు చెందిన గౌస్ ఆదివారం గోవును చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా స్థానికులు గమనించి గ్రామపంచాయతీకి, పోలీసు శాఖకు సమాచారం ఇవ్వడంతో పంచాయతీ సిబ్బంది వచ్చి దుకాణాలు బంద్ చేయించారు. ఎస్‌ఐ గోపి గోవధ చేసి మాంసాన్ని విక్రయించిన గౌస్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇదేరోజు విద్యానగర్‌లో మాంసం విక్రయిస్తున్న నర్సింగ్ అనే వ్యక్త్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చిత్రం.. నేరేడుచర్లలో గోవధ జరిపిన దుకాణం