తెలంగాణ

భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, నవంబర్ 29: అగ్ని సాక్షిగా పెళ్లాడి..నూరేళ్లు తోడుగా ఉంటూ జీవనాన్ని గడపాల్సిన ఓ భర్త కసాయిగా మారాడు. క్షణికావేశంలో విచక్షణా రహితంగా భార్య గొంతు కోసి హతమార్చాడు. మంగళవారం సాయంత్రం ఈ విషాద సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ కాలనీ కవిత(25), ఈశ్వర్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి వీరిరువురి మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి.
పది రోజుల క్రితం కవిత, తన భర్త ఈశ్వర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈశ్వర్ తన కుటుంబ సభ్యులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా అచూకీ లభించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ ఫిర్యాదు కూడా చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు కవితను గాలించి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏలాంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు వారిని వదిలిపెట్టారు. అక్కడి నుంచి కవిత, ఈశ్వర్ ప్రకాశ్‌నగర్ బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ వీరి మధ్య మళ్లీ మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఈశ్వర్ భార్య కవిత గొంతును బ్లేడ్‌తో కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో కవిత అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు హుటహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బేగంపేట సబ్ డివిజన్ ఎసిపి రంగారావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జగన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. నిందుతుడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.