తెలంగాణ

భూదాన్‌బోర్డు మాజీ చైర్మెన్ రాజేందర్‌రెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/హయత్‌నగర్, డిసెంబర్ 2: భూదాన్‌బోర్డు భూములను అక్రమంగా విక్రయించాడనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు హయత్‌నగర్ పోలీసులు భూదాన్‌బోర్డు మాజీ చైర్మెన్ రాజేందర్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయితీ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ పరిధిలోని పాపాయిగూడ సర్వే 215, 224లోని భూదాన్ భూమిలో అర్హులైన వారికి పట్టాలు ఇవ్వకుండా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మన్సురాబాద్‌కు చెందిన కుక్కమూడి హేమలత, వనస్థలిపురం ప్రాంతానికి చెందిన పారంద రేణుకల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అమాయక ప్రజలను భూదాన్ భూమిలో ప్లాట్లు ఇస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిపారు. డిడిల రూపంలో డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు వెల్లడించారు. రాజేందర్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు.