తెలంగాణ

పరిశ్రమలో ప్రమాదం: ఇద్దరు కార్మికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, డిసెంబర్ 2. ఐరన్ పరిశ్రమలో ఫర్నెన్స్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని విజయా ఐరన్ పరిశ్రమలో చోటు చేసుకుంది. శుక్రవారం మూడవ షిఫ్టులో విధులు నిర్వహిస్తూ ఉండగా పరిశ్రమలోని ఫర్నెస్ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో ఫర్నెస్‌లోని లిక్విడ్ ఐరన్ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పడింది.
దీంతో విధులు నిర్వహిస్తున్న క్రిష్ణ (45), మంచ్‌దేశ్ (37) అనే కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగులు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని వెంటనే హైదరాబాద్‌లోని మైత్రి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్ధలాన్ని ఎస్‌ఐ సాయిరాం సందర్శించారు. ప్రమాద ఘటనపై ఐన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు ఆరా తీస్తున్నారు.

చిత్రం.. ఘటనా స్థలంలో మృతదేహాలు