తెలంగాణ
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 December 2016
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. శుక్రవారం నాడు చెన్నమనేని పౌరసత్వం వివాదం కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర తరఫున అదనపు సొలిసిటరీ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో సొలిసిటరీ జనరల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించింది. రమేష్ జర్మనీలో స్థిరపడి అక్కడ పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్ హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.