తెలంగాణ

హెచ్‌సియు విసికి ప్రధానిచే పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు సహస్రాబ్ది ఫలకాల గౌరవ పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా తిరుపతిలో అందుకున్నారు. 104 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందించారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు , కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర విజ్ఞాన శాఖ మంత్రి వై ఎస్ చౌదరి ఇతర ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. వ్యవసాయ రంగానికి బయోఏజెంట్ అన్న అంశంపై ఏర్పాటైన టాస్క్ఫోర్సు సభ్యుడిగా ప్రొఫెసర్ అప్పారావు వ్యవహరించారు.