తెలంగాణ

గోకుల్ బ్యాంక్‌లో నిలిచిన లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: సికిందరాబాద్‌లోని గోకుల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంక్ నిధుల అవకతవకలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బ్యాంక్ సిఇవో, చైర్మన్ జగదీశ్‌యాదవ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకులో దాదాపు రూ. 3.5 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగంపై బ్యాంక్ చైర్మన్ చీమల జగదీష్ యాదవ్‌ను శనివారం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా బ్యాంక్‌లో కనిపించని మూడున్నర కోట్ల నిధులపై పోలీసులు ఆరా తీస్తుండగా, గ్యాంగ్‌స్టర్ నరుూం తమను బెదిరించాడని, బ్యాంకును తమకు ఇవ్వాలంటూ నరుూం అనుచరులు ఒత్తిడి చేశారని, బ్యాంక్ చైర్మన్ భార్య సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ బ్యాంక్‌లో బినామి పేర్లపై గ్యాంగ్‌స్టర్ సుమారు మూడున్నర కోట్లు డిపాజిట్లు చేసి, రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని ఆమె తెలిపింది. గ్యాంగ్‌స్టర్ నరుూం, అతని అనుచరులు, బ్యాంక్ చైర్మన్ జగదీశ్ తలకు రూ. 5 కోట్లు వెల కట్టడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అతను నరుూం ముఠాకు బినామీ పేర్లపై మూడున్నర కోట్లు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. బ్యాంక్ చైర్మన్‌గా తన భర్త ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు.