తెలంగాణ

కరీంనగర్‌లో ఎల్‌పిజి ప్లాంట్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: కరీంనగర్ జిల్లాలో మరో ఎల్‌పిజి (గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపి వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ధర్మేంద్రప్రధాన్‌ను కలిసిన వినోద్‌కుమార్ ఉత్తర తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ సరఫరా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వినోద్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ సామర్థ్యం అవసరాలకు సరిపోవడం లేదని, మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల అవసరాలకు తగిన విధంగా గ్యాస్ ఉత్పత్తి పెంచాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.