తెలంగాణ

బల్లకట్టు వద్ద ప్రమాదం కృష్ణా నదిలో పడ్డ బియ్యం లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, జనవరి 7: నల్లగొండ జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని చింత్రియాల గ్రామం వద్ద కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్టు వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ నది ఒడ్డున నీళ్లలో పడగా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. హుజూర్‌నగర్ నుండి గుంటూరు జిల్లాకు బాయిల్డ్ బియ్యంతో వెళ్తున్న లారీ చింత్రియాల వద్ద బల్లకట్టును ఎక్కించేందుకు క్రమంలో అదుపుతప్పి నది వడ్డున ఉన్న నీటిలో పడింది. దీంతో లారీ ముడింతలు నీటిలో మునిగిపోయింది. డ్రైవర్, క్లీనర్ తప్పించుకోవడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత బల్లకట్టు యధావిధిగానే నిర్వహించారు. క్రేన్ సహాయంతో నదిలో మునిగిన బియ్యాన్ని, లారీని బయటకు తీశారు.