తెలంగాణ

భూపాలపల్లిలో 10 కొత్త గనులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జనవరి 8: భూపాలపల్లి ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉన్న అపారమైన బొగ్గు నిక్షేపాలు వెలికి తీసేందుకు కొత్త గనులను ప్రారంభించడానికి సింగరేణి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంతంలో కొత్తగా 1.3 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. మరో 150 ఏళ్లవరకు భూపాలపల్లి ప్రాంతానికి తిరుగుండదని చెబుతున్నారు. సింగరేణి మొత్తంమీద ఇక్కడి బొగ్గు నాణ్యమైనది కావడం, అపార నిల్వలు ఉండటం వల్ల భూపాలపల్లి భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని, పది కొత్త గనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. భూపాలపల్లి నుండి గుండాల ప్రాంతాలలో ఉన్న అపారమైన బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు గనులను ప్రారంభించి ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఈ దరిమిలా జిల్లాలో 52 కిలో మీటర్ల పొడువునా బొగ్గు నిక్షేపాలను సింగరేణి యాజమాన్యం గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా భూపాలపల్లి ఏరియాలో బి గ్రేడ్ బొగ్గు ఇక్కడి గనుల్లో ఉందని, బి గ్రేడ్ బొగ్గు సింగరేణిలో ఎక్కడ లేదని వారు భావిస్తున్నారు. రెండు సిమ్‌లలో ఒక సిమ్ ఖచ్చితంగా బిగ్రేడ్ లాంటి అత్యంత నాణ్యమైన బొగ్గు ఉందని యాజమాన్యం భావిస్తుంది. ఇప్పటికే వాటిని బ్లాక్‌లుగా గుర్తించడంతో అవి ఏరియాకు గుండెకాయ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
తలమానికం కాకతీయ గనులు
భూపాలపల్లి ఏరియాలో 1988 జూలై 17న కెటికె 1వ గని ప్రారంభించారు. ఇలా మొదలైన ప్రస్థానం కెటికె 2, కెటికె 5, కెటికె 6, ఒక లాంగ్‌వాల్ ప్రాజెక్ట్, ఒక ఉపరితల గని వరకు చేరుకుంది. మరో 10 గనుల ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందులో తాటిచర్ల-2 ఉపరితల గని 50 ఏళ్ల అతి పెద్ద ఉపరితల గనిగా అవిర్భవించ బోతోందని, రానున్న రోజుల్లో ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సింగరేణి కంపెనీకే భూపాలపల్లి ఏరియా తలమానికంగా మారనుంది. ఈ ఏడాదికి సుమారుగా 33 లక్షల టన్నుల బొగ్గు సాధించే అవకాశాలు ఉన్నాయని యాజమాన్యం భావిస్తోంది.
ప్రధాన కార్యాలయం ఇక్కడే?
1.3 మిలియన్ బొగ్గును కలిగి ఉండి దాదాపు 150 సంవత్సరాల భవిష్యత్ భూపాలపల్లి ఏరియాకు ఉండడంతో భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏరియా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కూడా గతంలో భూపాలపల్లినే సింగరేణి హెడ్ క్వార్టర్‌గా గుర్తించాలని కూడా ప్రతిపాదన కూడా చేసింది. అయితే ఆ ప్రతిపాదన ఇంకా అమలుకు నోచుకోలేదు. భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పాటు కావడంతో భూపాలపల్లిలోనే సింగరేణి ప్రధాన కార్యాలయ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఏరియా సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతానికే చెందిన స్పీకర్ మధుసూదనాచారి ఈ విషయంలో చొరవ తీసుకుంటే ఫలితం ఉంటుందని వారు అంటున్నారు.