తెలంగాణ

కెసిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం : టిజిసిసిఎల్‌ఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారని ఆయన చిత్రపటాలకు తమ సంఘం తరఫున పాలాభిషేకం చేస్తున్నట్టు టిజి సిసిఎల్‌ఎ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కనక చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిలుపుదల చేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని , కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కెసిఆర్ దిష్టబొమ్మను దగ్ధం చేస్తున్నారని ఇదెంత మాత్రం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సిబ్బంది ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారని తెలిపారు. జీతాల పెంపుతో తమ జీవితాల్లో కొత్త వెలుగును సిఎం తెచ్చారని ఆయన పేర్కొన్నారు.