తెలంగాణ

బాలికల విద్యకు హజ్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్ ఎంపి, మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ సంచలనమైన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం సాలీనా రూ.690 కోట్లను ఖర్చుపెడుతోంది. ఒవైసీ ఈ విషయమై ట్వీట్ చేశారు. కేంద్రం హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేసి, ఆ నిధులు బాలికల విద్యకు ఖర్చుపెట్టాలని ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా ఈ ఏడాది భారత్ నుంచి వచ్చే ముస్లిం యాత్రికుల సంఖ్యను 1.30 లక్షల నుంచి 1.70 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయాన్ని ఒవైసీ స్వాగతించారు. అదే సమయంలో హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీ రూ. 690 కోట్లను బాలికల విద్యకు ఖర్చు చేస్తే బాగుంటుందని కేంద్రానికి సూచన చేశారు.