తెలంగాణ

ప్రాజెక్టులు పూర్తి చేసే సమర్థత మీకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసే సమర్థత మీకు లేదని టిఆర్‌ఎస్ శ్రేణులను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీని నిందించడం సరికాదని అన్నారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేక, ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చారని, నిపుణుల కమిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే నీటి ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోలేక పోతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వకపోడం వల్లే నిపుణుల కమిటీ తిరస్కరించిందని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు కూడా సరైన వివరాలు సమర్పించకపోవడం వల్లే నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలను మర్రి శశిధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
అరుణకు క్షమాపణ చెప్పాలి
సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణకు మంత్రి తలసాని, నేత గువ్వల బాలరాజు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేస్తామని టిపిసిసి అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, పున్నా కైలాస్ నేత తదితరులు చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడితే టిఆర్‌ఎస్ నేతల నాలుక కోస్తామని హెచ్చరించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టిఆర్‌ఎస్ నాయకులు డికె అరుణను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని అన్నారు.