తెలంగాణ

దిగ్విజయ్ సింగ్‌పై డబీర్‌పుర పిఎస్‌లో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై హైదరాబాద్ డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణలోని మదర్సాలు, శిశుమందిరాలపై దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ బచావో తహరిక్ (ఎంబిటి) నేత అమ్జదుల్లా ఖాన్ డబీర్‌పుర పిఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. మదర్సాలు, శిశుమందిరాల్లో సంఘవిద్రోహ బోధనలు జరుగుతున్నాయని భావనతో కూడిన వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పేర్కొనడం దిగ్విజయ్‌కు తగదని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమ్జదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు డబీర్‌పుర పోలీసులు తెలిపారు.