తెలంగాణ

ఉస్మానియావర్శిటీలో 11న శతాబ్ది పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 11న శతాబ్ది పరుగు నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. మంగళవారం నాడు ఆయన పరుగు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి వేణుగోపాలరావు, స్పెషల్ ఆఫీసర్ హెచ్ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 11న యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పరుగును ప్రారంభిస్తారని చెప్పారు. యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరికి సంబంధించిన అమెరికా ప్రతినిధి బృందం మంగళవారం నాడు విసి ప్రొఫెసర్ రామచంద్రంను కలిసి పరస్పరం బోధన అభ్యసన అనుభవాలను మార్పిడి చేసుకోవడంపై చర్చించారు. మిస్సోరి యూనివర్శిటీ విసి డాక్టర్ జోయల్ జి , ఒయు పూర్వ విద్యార్ధి దీపక్ వ్యాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.