తెలంగాణ

నలుగురు ఐపిఎస్‌లకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో నలుగురు ఐపిఎస్ అధికారులు పదోన్నతి పొందారు. హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్‌రెడ్డికి డిజిపి హోదా లభించింది. డిజిపి స్థాయి అధికారిగా నగర కమిషనర్‌గా ఉండడం ఇదే మొదటిసారి. తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, మహేందర్‌రెడ్డి, అలోక్ ప్రభాకర్, టి కృష్ణప్రసాద్‌లకు డిజిపి హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్న అలోక్ ప్రభాకర్ డిజిపి పదోన్నతి కల్పించి పాత పోస్టులోనే ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. అదేవిధంగా పదోన్నతి పొందిన మిగతా అధికారులు కూడా యథాస్థానంలో కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.