తెలంగాణ

ఎస్‌పి, బిజెపిలకు ఓటమి ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి), బిజెపిలు రెండూ ఓడిపోవడం ఖాయమని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ రెండు పార్టీలు యుపిలో ఘోర పరాజయాన్ని చవిచూస్తాయని, అందుకు ఆ ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు. గడచిన ఐదేళ్లలో యుపిలో ప్రజారంజక పాలన అందించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఉపాధి కల్పన, మతోన్మాద శక్తులను అరికట్టడంలో వైఫల్యం చెందడంతో విసుగెత్తిన ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లు రెండు పార్టీలను ఓడిస్తారని అన్నారు. తమ పార్టీ కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిఎస్‌పి పార్టీతో పొత్తుపెట్టుకునే అవకాశంపై ఆచి తూచి స్పందించిన ఒవైసీ ఎన్నికల్లో ప్రజాతీర్పు వచ్చాకే ఏదైనా చెప్పగలమని స్పష్టం చేశారు.