తెలంగాణ
ఎయిర్గన్తో భార్యపై కాల్పులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్/మేడ్చల్, మార్చి 14: మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ ఫామ్ హౌస్లో సింగిరెడ్డి వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఎయిర్గన్తో తన భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి భార్య శిరీషను బేగంపేట్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మొదట ప్రమాదవశాత్తు ఎయిర్గన్ పేలినట్టు వార్తలు రాగా, పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి రెండు ఎయిర్గన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకట్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు డిసిపి సాయిశేఖర్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతోన్న సిఐ శంకర్ యాదవ్ కాల్పులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.