తెలంగాణ

కన్న కొడుకుపై తల్లి పైశాచికత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల / హైదరాబాద్, మార్చి 16: కన్న కొడుకుపై ఓ తల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై లింగ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన మురళికృష్ణ ఆటోడ్రైవర్. 2005 సంవత్సరంలో ఆర్‌సిపురం, బీరమ్‌గూడకు చెందిన అనుషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు విష్ణువర్దన్, చిన్న కొడుకు హర్షవర్దన్ ఉన్నాడు. మురళీకృష్ణ, అనుష మధ్య మనస్పర్థలు చోటుచేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కొడుకులు సైతం అనుష వద్దనే ఉంటున్నారు. ఐదు నెలల క్రితం అనుష మరో వ్యక్తి అశోక్‌రెడ్డిని వివాహం చేసుకుంది. వారం క్రితం బాచుపల్లిలో ఉండే అనుష షాపూర్‌నగర్‌లో ప్రస్తుతం నివాసముంటుంది. హర్షవర్దన్ తన తండ్రి వద్దకు వెళ్తానని అనుషతో చెప్పాడు. తండ్రి లేడంటూ, చనిపోయాడంటూ గరిటతో కాల్చి వాతలు పెట్టింది. కన్న కొడుకుపై పైశాచిక ప్రేమను చూపుతూ చిత్రహింసలకు గురిచేసింది. తట్టుకోలేక హర్షవర్ధన్ బుధవారం రాత్రి 7.30 గంటలకు సంగారెడ్డిలోని తండ్రి మురళీకృష్ణ వద్దకు వెళ్లాడు. మురళీకృష్ణకు హర్షవర్దన్ తల్లి అనుష పెట్టిన చిత్ర హింసలను వివరించాడు. దీంతో తట్టుకోలేకపోయిన మురళీకృష్ణ.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి అనుషపై ఫిర్యాదు చేశాడు. కన్న తల్లి కొడుకు మర్మాంగంపై వాతలు పెట్టడాన్ని మండిపడ్డాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. తల్లి అనూష చేతిలో చిత్రహింసలకు గురైన హర్షవర్దన్