తెలంగాణ

మతపరమైన రిజర్వేషన్లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 21: మత పరమైన రిజర్వేషన్లను ఇచ్చే ప్రతిపాదనలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం బిజెవైఎం ఆధ్వర్యంలో చీర్యాల చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్‌ను కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. రామచందర్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ ప్రభుత్వం.. మతపరమైన రిజర్వేషన్లు చేయటం సిగ్గు చేటన్నారు.
విద్యా, ఉపాధి కల్పన కోసం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటు బ్యాంక్ కోసమే మతపరమైన రిజర్వేషన్లను కేసిఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇరవై సార్లు మతపరమైన రిజర్వేషన్లును కొట్టివేసినా, కెసిఆర్‌కు బుద్ధి రావటం లేదని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందరూ సమానమేనని, అందరికీ సమానమైన హక్కులను కల్పిస్తూ అక్కున చేర్చుకుంటుంటే, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. కులాల పేరుతో బడ్జెట్, మతాల పేరుతో రిజర్వేషన్లు అంటూ ప్రజలును తప్పుత్రోవ పట్టిస్తూ లాభం పొందాలని చూస్తోందని విమర్శించారు. భాజపా ఎవరికీ వ్యతిరేకం కాదని, మిగతావారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఎంవి రెడ్డికి వినతిపత్రం అందజేసారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. భాజపా కార్యకర్తలు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసారు.
అక్కడ ఉన్న పోలీసులు.. కలెక్టర్ కార్యాలయానికి తాళాలు వేసి కార్యకర్తలను లోనికి వెళ్లకుండా నిలవరించారు. కార్యకర్తలు అక్కడే భైఠాయించి నినాదాలు చేసారు. అప్పడే కలెక్టర్ ఎంవి రెడ్డి కార్యాలయానికి విచ్చేశారు. కేవలం కలెక్టర్‌ను మాత్రమే పోలీసులు లోనికి వెళ్లనిచ్చారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. భాజపా కార్యకర్తలను కలెక్టరేట్‌లోకి రానివ్వకుండా నివారించడంలో పోలీసులు విఫలమయ్యారు.

చిత్రం..కలెక్టరేట్‌లోకి చొచ్చుకెలుతూన్న భాజపా కార్యకర్తలు