తెలంగాణ

అడ్డగోలుగా మాట్లాడితే కేసులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ‘మాది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. కడుపు కట్టుకొని ఉద్యమ స్ఫూర్తితో అవినీతిరహిత పాలన అందిస్తున్నాం. అయినప్పటికీ ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులతో నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎంత మాత్రం సహించేది లేదు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తే ఆ శాఖ మంత్రి స్పందించి శాఖపరంగా కేసులు పెడతారు’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఇకనైనా గుడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన విపక్షాలకు హితవు పలికారు. తెరాస 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో జరిగిన ప్లీనరీ ముగింపు సందర్భంగా పార్టీ అధినేత కెసిఆర్ ప్రసంగిస్తూ, గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోపిడీ చేసి ఖజానకు గండికొట్టారని దుయ్యబట్టారు. వారి హయాంలో ఇసుక మాఫీయాల వల్ల ఐదు లక్షల రూపాయాలకు పడిపోయిన ఆదాయాన్ని తాము అధికారంలోకి వచ్చాక గత ఏడాది రూ.375 కోట్లు, ఈ ఏడాది రూ. 460 కోట్లకు తీసుకొచ్చామని, అవినీతి రహిత పాలనకు, తమ చిత్తశుద్ధికి ఇదే తార్కాణమని తెలిపారు.
ప్రజల మనోభిష్టాన్ని 100 శాతం నెరవేరుస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా 135 జీవోల ద్వారా 155 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని తెరాస శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో ఇప్పటికే పార్టీ శ్రేణులకు కొన్ని పదవులు ఇచ్చామని, త్వరలో మరిన్ని నామినేటెట్ పదవులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పార్టీ సభ్యత్వాల సంఖ్య 75 లక్షలకు చేరుకోవడంతో వారిని ఆదుకునేందుకు మంత్రులతో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.