తెలంగాణ

రైతుల ముసుగులో టిడిపి గూండాల స్వైరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రైతుల ముసుగులో టిడిపి గుండాలు కొన్ని దుష్టశక్తులతో కలిసి ఖమ్మం మార్కెట్‌పై దాడి చేయడం దుర్మార్గమని తెరాస మండిపడింది. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కనుసన్నల్లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస పట్టని టిడిపి నాయకులు ఇప్పుడు రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని, వరంగల్‌లో తెరాస నిర్వహించిన ప్రగతి నివేదిక సభ విజయవంతం కావడాన్ని జీర్ణంచుకోలేక అక్కసుతో ఈ దాడి చేశారని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాలకు రైతులను పావులుగా వాడుకునేందుకు టిడిపి తప్పుడు పద్దతులను అవలంబిస్తోందన్నారు. గత రెండున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని, పొరుగు రాష్ట్రంలో రుణమాఫీ ప్రకటించినా రైతుల ఖాతాలో ఇంకా ఆ సొమ్ము జమ చేయలేదని చెప్పారు.