తెలంగాణ

450 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26:వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 450 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని కోరు తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఎపి విభజన చట్టం 2014లోని సెక్షన్ 94(ఎ) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల కాలానికి 30,571 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కావాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల గ్రాంట్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విడత కేవలం 450 కోట్ల రూపాయల గ్రాంట్‌ను మాత్రమే విడుదల చేసిందని, వెంటనే రెండర గ్రాంట్‌ను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు విడతల గ్రాంట్ ఇప్పటికే విడుదల చేసినట్టు ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రికి తెలిపారు.