తెలంగాణ

నాచగిరి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇబ్బందులు రానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 26: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న మెదక్ జిల్లా నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. శనివారం సాయంత్రం సిఎం క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నాగరాజు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు సిఎం కెసిఆర్‌కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడంతో పాటు తాగునీటి వసతులు కల్పించాలని సూచించారు. వీలునుబట్టి స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.