తెలంగాణ

తెలంగాణ అవార్డు కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. ఈ అవార్డు గ్రహీతల ఎంపిక కోసం పది మందితో ఒక కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి చందూలాల్ నేతృత్వంలో పది మంది సభ్యుల కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది. కెవి రమణాచారి, రసమయి బాలకిషన్, బుర్రా వెంకటేశం, నందిని సిద్ధారెడ్డి, మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్, నారదాసు లక్ష్మణ్‌రావు, భూమయ్య, సూర్యప్రకాశ్, అలేఖ్య ఈ కమిటీలో సభ్యులు. కమిటీ ఎంపిక చేసిన అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో అవార్డులు అందజేస్తారు.