తెలంగాణ

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో సోమవారం ఉదయం ఓ లారీ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అక్కా, చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మరో వైపు తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారుల తాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే బాలయ్య మనుమరాళ్లు స్నేహ ఆరోతరగతి, చెల్లెలు హర్షిత మూడోతరగతి చదువుతుంది. కాగా సోమవారం ఉదయం స్కూల్ నుంచి స్కూటిపై ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తుండగా వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న లారీ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కా,చెల్లెళ్లు అక్కడిక్కడే మృతి చెందగా చిన్నారుల తాత బాలయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా మరో ముగ్గురిపై టిప్పర్ దూసుకెళ్లడంతో స్వల్పంగా గాయపడ్డారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు కీసర పోలీసులు తెలిపారు.
రాంపల్లిలో విషాదం..
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అక్కా,చెల్లెళ్లు మృతి చెందడంతో రాంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.