తెలంగాణ

కెసిఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, జూన్ 11 : దేశంలో అతిపెద్ద కుంభకోణాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని, అవినీతిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని దీనికి కారణం సిఎం కెసిఆర్ పాలన తీరేనని మాజీ మంత్రి, బిజెపి ముఖ్యనేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని 111 డివిజన్ పరిధిలో పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ కార్యవిస్తారక్ యోజన విజయోత్సవ సభను నిర్వహించారు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నాగం మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అవినీతిమయ పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద భూకుంభకోణాలకు సహకరిస్తున్న కెసిఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని అన్నారు. అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. మియాపూర్ భూముల విషయంలో ప్రభుత్వానిదే నైతిక బాధ్యత అని క్రిమినల్ కాంప్రమెన్సీ కింద కెసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టులో టిఆర్‌ఎస్ నేత కేశవరావు కూతురు కొన్న భూములపై స్టే ఆర్డర్ ఉందని ఆ భూములను ప్రైవేటుపరం చేయకపోయినా గోల్డ్‌స్టోన్ కంపెనీ నుంచి ఎలా కొనగలిగారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల తుప్పాలగూడ 185 ఎకరాల ఖరీదైన స్థలం అన్యాక్రాంతం అయిందని కోర్టు ప్రభుత్వానికి నివేదిక అందించినా కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో బయటపెట్టి కెసిఆర్ దురాగాతాలపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.