తెలంగాణ

అతి పెద్ద అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన 125 అడుగులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అంబేద్కర్ 125వ జయంతోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న విగ్రహానికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విగ్రహావిష్కరణ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అంబేద్కర్ 125వ జయంతోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ నెలా ఒక కార్యక్రమం జరగాలని, ప్రతీ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇంకా దళితుల అభ్యున్నతి కోసం, చైతన్యం కోసం కార్యక్రమాలకు రూపకల్పన జరగాలని సిఎం సూచించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని, అలాగే అంబేద్కర్ స్క్వేర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. యావత్ దేశం అభిమానించే,ఆదర్శంగా కొలిచే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి, జయంతోత్సవాల నిర్వహణకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా కన్వీనర్‌గా కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహ్మారెడ్డి, చందూలాల్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి రసమయి బాల్‌కిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.