తెలంగాణ

టి.టిడిపిలో ‘నంద్యాల’ సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ తెలుగు దేశం పార్టీలోనూ నూతనోత్సాహం కలిగించింది. ఫలితం వెలువడిన వెంటనే హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు, కార్యక్రమాల కమిటీ నాయకుడు జి. బుచ్చిలింగం అధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును వారానికి ఒకసారి కాకపోయినా, నెలకోసారైనా తెలంగాణలో పర్యటించేలా ఒత్తిడి చేయాలని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బెట్టింగ్‌లు కట్టిన వారు షాక్‌కు గురయ్యేలా నంద్యాల ఓటర్లు తీర్పు చెప్పారని టి.టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. నంద్యాల ఫలితంతో టి.టిడిపి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని ఆయన తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక వంటి ఫలితాలే తెలంగాణలోనూ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేస్తారని ఆయన చెప్పారు.