తెలంగాణ

భూ సర్వేపై అఖిలపక్షం నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: భూ సర్వేపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేవలం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడితే సరిపోదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. మొదట హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ విషయాన్ని మరచిపోవడం ముఖ్యమంత్రికి అలవాటేనని అన్నారు. అన్నీ బూటకపు సర్వేలు వెల్లడిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి అంతగా నమ్మకం ఉంటే ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.