తెలంగాణ
‘బైసన్ పోలోలో కొత్త సచివాలయం వద్దు’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 September 2017
హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని యధాతధంగా కొనసాగించాలని, సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్కు తరలించవద్దని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలు ఖాళీ అయిన తర్వాత తెలంగాణకు కావాల్సినంత వసతి సౌకర్యం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. కాబట్టి కొత్తగా నిర్మించే ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుంది తప్ప ఉపయోగం ఉండదని ఆయన తెలిపారు.