తెలంగాణ

ఇద్దరు మృతి.. 27మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుగూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మణుగూరు నుండి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును సత్తుపల్లి నుండి కొత్తగూడెం వైపు వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న పాల్వంచ మండలం సంగెం గ్రామానికి చెందిన షంషుద్దీన్‌షా బేగం (72), సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన టిప్పర్ క్లీనర్ వెంకటరెడ్డి(42) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 27 మందిలో 12 మందికి తీవ్రంగా, 15 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న బాధితులను కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు సందర్శించి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు.

చిత్రం..ఎదురెదురుగా ఢీకొని నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు, టిప్పర్