తెలంగాణ

టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ తనపై దాడిచేసిన విషయమై కేసు పెట్టినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్నారై అతుల్ వాస్సే ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని తన ఇంటి అద్దె ఇవ్వకపోవడమే కాకుండా, ఇల్లు ఖాళీ చేయడం లేదని ఆమె వ్యధ చెందారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇంటి అద్దె విషయమై రెండేళ్ల నుంచి తనను వేధిస్తున్న ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్‌పై గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎమ్మెల్సీపై కేసు పెట్టినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. మహిళలను గౌరవించని వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎలా కొనసాగుతారని నిలదీశారు. ఈ విషయాన్ని గవర్నర్, అమెరికా కాన్సులేట్ దృష్టికి తీసకెళ్తానని హెచ్చరించారు.