తెలంగాణ

కమల్ దేశద్రోహి పరిపూర్ణానంద విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్-కాచిగూడ, నవంబర్ 8: నటుడు కమల్ హసన్ దేశద్రోహి అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సంచలన వాఖ్యలు చేశారు. ఆయన బుధవారం జలవిహర్‌లో విలేఖరుతో మాట్లాడుతూ, హిందువులు తీవ్రవాదులని, కాషాయ ఉగ్రవాదులని కమల్ చేసిన విమర్శలను ఏ హిందువూ సహించడని అన్నారు. హిందూవుల ప్రతిష్టను దిగజార్చే వారంతా దేశద్రోహులేనని అన్నారు. పాకిస్తాన్‌లోనో, సిరియా లోనో కమల్ పౌరసత్వం తీసుకుని జీవించాలని వాఖ్యానించారు. హిందూ సనాతన ధర్మన్ని అవమాన పరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మరో మతంపై విమర్శలు చేసే దమ్ము, ధైర్యం కమల్ హసన్‌కు ఉన్నాయా? ఆయన ప్రశ్నించారు. కమల్ విమర్శలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వౌనం పాటించడం దేశద్రోహులను ప్రేరేపించిన్నట్లే అవుతుందన్నారు. ఇకనైనా కమల్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.