తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 10: సిఎల్పీ ఉపనేత, నల్లగొం డ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోజూ తన పిచ్చిమాటలు, అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడంలో గోబెల్స్‌ను మించిపోయాడని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు తాను టిఆర్‌ఎస్ నుండి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపిగా హస్తం గుర్తుపై తనను రెండుసార్లు గెలిపించినట్టుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
2009ఎన్నికల్లో కోమటిరెడ్డికి 60,665ఓట్లు వస్తే తనకు 68,987ఓట్లు వచ్చాయని, 2014ఎన్నికల్లో కోమటిరెడ్డికి 60,774ఓట్లు వస్తే తనకు 66,339ఓట్లు వచ్చిన సంగతి మరిచి కోమటిరెడ్డి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 2004ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాను టిఆర్‌ఎస్, సిపిఐ, కాంగ్రెస్‌ల అభ్యర్ధిగా పోటీచేసి కోమటిరెడ్డిపై ఓడిపోవడం జరిగిందన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ 60వేల చొప్పున ఓట్లు సాధించిన కోమటిరెడ్డి ఇక్కడ సీఎం కెసిఆర్ పోటీచేస్తే ఆయనపై 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటూ చెప్పడం కోమటిరెడ్డి అబద్ధాలకు నిదర్శనమన్నారు. మూడుసార్లు ఎంపిగా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్న క్రమంలో స్వరాష్ట్రం అభివృద్ధికి సీఎం కెసిఆర్ చేస్తున్న కృషికి మద్దతుగా తెలంగాణ కోసం పార్లమెంటు లోపల, బయట ఉద్యమించిన తాను టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. సీఎం కెసిఆర్ సహకారం తో ఇన్నాళ్లుగా జిల్లా ప్రజల ఆకాంక్షలైన నల్లగొండ బత్తాయి మార్కెట్, పిఏపల్లిలో దొండ మార్కెట్, నల్లగొండ, సూర్యాపేటల్లో రెండు మెడికల్ కళాశాలలు తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మంజూరు చేయించుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఎస్‌ఎల్‌బిసి సొరంగం మార్గం ప్రాజెక్టులో భాగమైన లోలెవల్ కెనాల్ పూర్తి చేసుకోగా, ఉదయ సముద్రం ఎత్తిపోతల, సొరంగం పనులు, నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్లు త్వరలో పూర్తికానున్నాయన్నారు. దేవరకొండ, మునుగోడు ప్రాంతా ఫ్లోరైడ్, కరవు నిర్మూలనకు డిండి ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ నిర్మింపచేస్తున్నారన్నారు. కోదాడ- హుజూర్‌నగర్-దేవరకొండ- జడ్చ ర్ల హైవే, సిరివెంఛ-రేణిగుంట హైవేలు మంజూరు అయందన్నారు. బీబీనగర్-నల్లపాడు ఎలక్ట్ఫ్రికేషన్ పనులు సైతం 375 కోట్లతో మంజూరుకాగా ఈ ఏడా ది 100 కోట్లు కేటాయించారన్నారు. నల్లగొండ- మాచర్ల రైల్వేలైన్ పెండింగ్ ప్రాజెక్టు సాధనకు కూడా కృషి సాగుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం, తాను చేసిన కృషినే టిఆర్‌ఎస్‌ను, నన్ను మళ్లీ అన్ని ఎన్నికల్లోనూ గెలిపిస్తాయన్నారు.
నల్లగొండ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ను బలోపేతశక్తిగా నిలిపిన దుబ్బాక నరసింహారెడ్డి త్వరలో రాష్ట్ర కార్పోరేషన్ పదవి ఇవ్వనున్నట్లుగా ఇప్పటికే మంత్రి కెటిఆర్ ప్రకటించారన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్దికి మంత్రి జగదీష్‌రెడ్డి సారధ్యంలో అంతా కలిసికట్టుగా ముందుకెలుతు వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో మహిళాకోఆర్డీనేటర్ మాలే శరణ్యారెడ్డి, ఎంపిపి పాశం రాం రెడ్డి, దైద రజిత, కౌన్సిలర్లు దుబ్బా అశోక్‌సుందర్, అభిమన్యు శ్రీనివాస్, అబ్బగాని రమేష్‌లు ఉన్నారు.