తెలంగాణ
కరెంట్ షాక్తో తల్లీకూతుళ్ల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 November 2017
రామాయంపేట, నవంబర్ 14: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగార్జున్గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన దాకి మల్లమ్మ (70), ఆమె కూతురు దాకి భూదవ్వ (40) తమ వ్యవసాయ పొలం వద్ద సోమవారం రాత్రి వరికుప్ప చుట్టూ పందుల కోసం కరెంట్ షాక్ పెట్టారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు తల్లికి కరెంట్ షాక్ రావడంతో కాపాడడానికి వెళ్లిన కూతురు మృత్యువాత పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు ఒకేసారి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.