తెలంగాణ

విద్యార్థి మృతికి కారకులైన స్కూల్ నిర్వాహకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నేరెడ్‌మెట్, నవంబర్ 15: ఓ బాలుడి మృతికి కారకులైన మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్ బచ్‌పన్ ప్లే స్కూల్ నిర్వహకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో మంగళవారం ఉదయం నీటి సంపులో పడి శివ రచిత్ అనే బాలుడు (3) మృతి చెందిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఆర్‌కెనగర్‌కు చెందిన అనిల్‌కుమార్ కొడుకు శివరచిత్ ఆనంద్‌బాగ్‌లో బచ్‌పన్ ప్లే స్కూల్‌లో నర్సరి చదువుతున్నాడు. పాఠశాల అవరణలో ఉన్న సంపు మూతను సిబ్బంది నిర్లక్ష్యంతో తెరిచి ఉంచడంతో శివరచిత్ సంపులో పడి మృతి చెందినట్టు పోలీసులు నిర్ధరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు బుధవారం బచ్‌పన్ పాఠశాల ప్రిన్సిపాల్, డైరక్టర్ కే.రాఘవేంద్ర(40), కౌన్సిలర్ ఎల్.ఉన్నికృష్ణన్(47), వాచ్‌మెన్ పాట్రిక్(52)ను అరెస్టు చేసి వారిపై ఐపిసి సెక్షన్ 304(8ఎ) కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు సీఐ జానకిరెడ్డి, ఎస్‌ఐ మన్మధకుమార్ తెలిపారు.